బాలబాలికలు అందరూ పాఠశాలల్లోనే ఉండాలని ఎట్టిపరిస్థితుల్లో పనికి వెల్లరాదని, మైనర్ పిల్లలకు విద్య అందించటానికి, పోషకారలోపం లేకుండా చూడటానికి తాము ఎల్లవేలల సిద్ధంగా ఉంటామని ఎస్సీపీసీఆర్ సభ్యురాలు అపర్ణ, బృందాదర్ అన్నారు. గత నెల రోజుల క్రితం బసవతారకంనగర్, గౌలిదొడ్డిలో ఉన్న గుడిసెలను పలు కారణాలతో కూల్చివేసారని తెలుసుకుని గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. దీంతో అక్కడి నివసిస్తున్నవారు కూడు గూడు కోల్పోవటంతో దాని ప్రభావం పిల్లలపై పడి విద్యకు దూరమై పోషకాహార లోపానికి గురయ్యారన్నారు. కమిటీ సభ్యులు స్థానిక అంగన్వాడీ సెంటర్కు పిల్లలను పంపించటానికి గాను వెహికిల్ ఏర్పాటు చేయాలని, అదే విధంగా గర్బీణులు బాలింతలకు తగు సదుపాయాలు అందించి టేక్ హోం రేషన్ అందించాలని స్థానిక సీడీపీవో, అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు.
పిల్లల తల్లిదండ్రులు కూడా స్థానిక ఐసీడీఎస్ అధికారులుకు సహకరించి పిల్లల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి, స్త్రీ, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ వారి ఆదేశాల మేరకు సీడీపీవో లక్ష్మీబాయి, బీఆర్బీ కో-ఆర్డినేటర్ హర్షవర్థిని, జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్ కుమార్ శేరిలింగంపల్లి మండలంలోని బసవతారకంలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యుల నుంచి పిల్లల సమాచారాన్ని సేకరించి ఎస్సీపీసీఆర్కు నివేదిక అందజేస్తామన్నారు. అవసరమైతే టేక్ హోమ్ రేషన్ అందించి పోషకాహార లోపం లేకుండా కృషి చేస్తామని తెలిపారు.