మొయినాబాద్ : తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రంగరాజన్తో మాట్లాడి చిలుకూరు బాలాజీ విశిష్టతను తెలుసుకున్నారు. భూపాల్రెడ్డికి అర్చకులు పూలమాల వేసి స్వామి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మొయినాబాద్ సీఐ రాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.