కొత్తూరు : ఒమిక్రాన్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. శనివారం ఎంపీపీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా థర్డ్వేవ్ ప్రమాదం పొంచి ఉందని అందుకోసం ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇంతకు ముందు వ్యాక్సిన్ కొరత ఉండేదని చెప్పారు. కానీ ఇప్పడు కావాల్సినంత వ్యాక్సిన్ ఉందని వివరించారు. అందువల్ల అలసత్వం వహించకుడా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
రైతులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా పంట మార్పిడి సూచనలు పాటించాలన్నారు. అంతేకాకుండా యాసంగిలో వరి కొనుడోలు చేయనని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసిందని అందువల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు. పల్లెప్రకృతి వనాల్లో పెంచిన చెట్లు పండ్లు తెంపుకొని తినే స్థితికి రావడం గొప్ప విషయం అన్నారు. మండలంలోని గ్రామాల్లో సమస్యలపై అధికారులు తక్షణం స్పందించి పరిష్కరించాలన్నారు. మండల సర్వసభ్య సమావేశానికి రాని అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మండలంలో సర్పంచులు తమ సమస్యలను ఏకరువు పెట్టడంతో అధికారులు తక్షణం స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
షాదిముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ..
ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాదిముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.
క్రిస్మస్ కానుకలు అందజేత
రాష్ట్ర ప్రభుత్వం అన్నిమతాలను సమాన ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 150 మంది క్రిస్టియన్ సోదరులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ క్రిస్మస్ కానుకలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, వైస్ ఎంపీపీ శోభ, ఎంపీడీవో బాల్రెడ్డి, తాసిల్దార్ రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.