కోట్పల్లి : కోట్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్, ఉర్దు మీడియం, కేజీబీవీ పాఠశాలలను బుధవారం జిల్లా విద్యాధికారి రేణుకాదేవీ తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన తనిఖీలో భాగంగా విద్యార్థుల రిజిస్ట్రర్ను పరిశీలించి, విద్యార్థులు పాఠశాలకు అధిక సంఖ్యలో హాజరు అయ్యేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు కరోనా మహమ్మరి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్కు సూచించారు.
ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 100శాతం ఉతీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.