ఇబ్రహీంపట్నం : ఉప్పరిగూడ సహకారసంఘం మాజీ చైర్మన్ నల్లబోలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాస మహదేవ్ల సేవలు మరువలేనివని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం సింగిల్విండో మాజీ చైర్మన్ అంజిరెడ్డి, సీనియర్ నాయకులు మహదేవ్ల ప్రథమ వర్థంతి కార్యక్రమాలను ఇబ్రహీంపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డిలు హాజరై నివాళులర్పించారు. ప్రజాసేవతో పాటు పార్టీకోసం చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.