చేవెళ్ల టౌన్ : దర్గామాత ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి నియోజకవర్గ ప్రజలు అమ్మవారి ఆశీస్సులు పొందాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం చేవెళ్లలోని రచ్చబండ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాలకు ఎంపీ రంజిత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను గౌరవిస్తూ సముచిత న్యాయం చేస్తుందని తెలిపారు. అనంతరం ఎంపీ రంజిత్రెడ్డిని ఎంపీపీ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
చేవెళ్లలోని రచ్చబండ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే యాదయ్యను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి మాలతికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.