వికారాబాద్ : అనారోగ్యానికి గురైన పేద ప్రజల దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు, వికారాబాద్, వికారాబాద్ మున్సిపాలిటి, మోమిన్పేట్, బంట్వారం, కోట్పల్లి, మర్పల్లి మండలాల లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ధారూరు మండలానికి సంబందించిన 10 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 4,64,800 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
వికారాబాద్ మండలానికి సంబంధించిన నలుగురి లబ్ధిదారులకు రూ. 4,11,100 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఒకరికి మంజూరైన రూ. 33,000 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును, మోమిన్పేట్ మండలానికి సంబందించిన 10మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 6,14,100 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, బంట్వారం మండలానికి సంబందించిన ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ. 2,09,500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, కోట్పల్లి మండలానికి సంబంధించిన ముగ్గురు లబ్ధిదారులకు రూ. 1,36,800 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, మర్పల్లి మండలానికి సంబంధించిన ఇద్దరు లబ్ధిదారులకు రూ. 62,000 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
వికారాబాద్ నియోజకవర్గాన్ని మొత్తం రూ. 19,31,300 విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధారూరు మండల అధ్యక్షుడు రాజునాయక్, వికారాబాద్ మండల అధ్యక్షుడు కమల్ రెడ్డి, ధారూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సంతోష్ కుమార్, నాయకులు వేణుగోపాల్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, రాజుగుప్తా, జైపాల్రెడ్డి, వికారాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.