గిట్టుబాటు ధర కోసమే కేంద్రాలు
రైతులు భౌతిక దూరాన్ని పాటించాలి
పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్
కులకచర్ల, ఏప్రిల్ 28 : రైతులకు మద్దతు ధర కల్పించేం దుకే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కులకచర్ల, చౌడాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నదని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని నేరు గా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించా రు. కరోనా పరిస్థితుల్లో రైతులు కరోనా బారిన పడకుం డా అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నదన్నారు. కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. చౌడాపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్ నాయక్, సర్పంచ్ కొత్త రంగారెడ్డి, ఎంపీటీసీ శంకర్, టీఆర్ఎస్ నాయకులు హరికృష్ణ, నర్సింలు,అశోక్, శివకుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు పాల్గొనగా కులకచర్ల గ్రామంలో నిర్వహించిన కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో కులకచర్ల ఎంపీటీసీ ఆనందం, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్రెడ్డి, శేరి రాంరెడ్డి, గుండుమల్ల నర్సింహులు, కృష్ణ, మొగులయ్య, కొండయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రాకొండ గ్రామంలో..
దోమ,ఏప్రిల్28: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ వెంకటమ్మ సూచించారు. బుధవారం దోమ మండల పరిధిలోని రాకొండ గ్రా మంలో సర్పంచ్ వెంకటమ్మ వరి ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాట చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగ య్య,మాజీ సర్పంచ్ లక్ష్మయ్య రైతులు పాల్గొన్నారు.