మంచాల, జూన్ 28 : రైతాంగ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ.70 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పట్టుదలగా పనిచేస్తున్నారన్నారు. ప్రతి సహకార సంఘం పరిధిలో నాబార్డు ఆధ్వర్యంలో రెండెకరాల స్థలంలో కోల్డ్ స్టోరేజీ, గోడౌన్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సహకార సంఘంలో రైతుల ప్రయోజనార్థం సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందజేసి అండగా నిలుస్తున్నదన్నారు. సంఘంలో రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి బ్యాంకు బలోపేతానికి సహకరించాలన్నారు.
ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. భవనాన్ని మూడు నెలల్లో పూర్తిచేయడంలో చైర్మన్తో పాటు పాలకవర్గం సభ్యుల కృషి, పట్టుదలను అభినందించారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి మాట్లాడుతూ… అతితక్కువ సమయంలో పీఏసీఎస్ భవన నిర్మాణం పూర్తిచేయగలిగామన్నారు. నియోజకవర్గంలో ఈ ఏడాది అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ నిత్యనిరంజన్రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, డీసీవో దాత్రిదేవి, శారద, ఇబ్రహీంపట్నం ఏజీఎం రమాదేవి, సహకార సంఘం డైరెక్టర్లు, సంఘం సీఈవో శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ శ్రీనివాస్రెడ్డితో పాటు పాలకవర్గం సభ్యులు సోమవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎస్ఐఐసీ నిధులు రూ.కోటితో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం ఎంతో సంతోషకరమని ఆయనకు కృతజ్ఞతలను తెలిపారు. గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే కిషన్రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ…మండలంలో ఫార్మా ఏర్పాటుకు భూములు కోల్పోతున్న మేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానన్నారు. టీఎస్ఐఐసీ ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఫార్మా ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఫార్మా భూ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ శివలీల, పీఏసీఎస్ డైరెక్టర్ స్వరూప, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు రాజునాయక్, రమేశ్, కిషన్, మధు, పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ
సీఎంఆర్ఎఫ్ పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి చెందిన ఆశీర్వాదంకు రూ.40వేలు, రవికి రూ.26వేలు, జయమ్మకు రూ.23వేలు, పార్వతికి రూ.15వేల చెక్కులను ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు.