వైద్య సిబ్బంది సేవలు భేష్
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పూడూరులో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
పరిగి, మే 27 : పరిగిలోని సర్కారు దవాఖానలో అవసరమైన సదుపాయా లు కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పరిగిలోని సర్కారు దవాఖానను సందర్శించిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి వైద్యు లు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో మందులు ఉన్నాయా అని అడుగగా సరిపోను ఉన్నట్లు ఇన్చార్జి డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. పరిగి దవాఖాన నుంచి ఇద్దరు సిబ్బందిని కొవిడ్ సెంటర్లో విధులు నిర్వహించేందుకు పంపించారని, వారిని పరిగి దవాఖానకు పిలిపించాలని కోరగా, జిల్లా వైద్యాధికారితో మాట్లాడి వెనక్కి పిలిపిస్తామని, పరిగిలో సేవలు అందజేసేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇతర ఉద్యోగులకు సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడి నియామకాలు జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతిరోజు ఇద్దరు స్వీపర్లను పరిగి సర్కారు దవాఖానలో పని చేసేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్ను ఎమ్మెల్యే ఆదేశించారు. దవాఖానకు త్వరలోనే జనరేటర్ సదుపాయం కల్పిస్తామని, ఇతర సదుపాయల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కొవిడ్ సమయంలో వైద్యులు, సిబ్బంది చక్కటి సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. సూపర్ స్ప్రెడర్లకు, అర్హులైన ఇతరులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలన్నారు. కరోనా పరీక్షల కోసం వచ్చే వారందరికీ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో ఎంపీపీ కె.అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, డాక్టర్లు సత్యనారాయణ, ప్రవీణ్ పాల్గొన్నారు.
పేదలకు అండగా ప్రభుత్వం
పూడూరు, మే 27 : నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్రెడ్డి అన్నారు. పూడూరు మండల కేం ద్రంలో ఆయా గ్రామాల్లోని 112 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. గురువారం మండల కేంద్రంలోని 10 మందికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల వివాహా లు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రవేశపెట్టారన్నారు. అర్హులందరికీ కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. లాక్డౌన్ సమయంలో బయటకు రాకుండా నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పి.నవ్యరెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, ఉప సర్పంచ్ టి.రాజేందర్, మాజీ సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, అనంతరాములు, అదిల్, ఆర్ఐ బాల్రాజ్ పాల్గొన్నారు.