షాబాద్/మొయినాబాద్, జూన్ 25: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సిద్ధించే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చేవెళ్ల నియోజక వర్గంలోని షాబాద్, మొయినాబాద్ మండలాల్లో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. షాబాద్ మండలం తాళ్లపల్లిలో రూ.2.11 కోట్లతో ఈసీ నదిపై చెక్డ్యామ్ల నిర్మాణానికి శంకుస్థాపన, రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదిక ప్రారంభం, రూ.1.88 కోట్లతో రేగడిదోస్వాడ- తిర్మలాపూర్ బీటీ రోడ్డు నిర్మాణ పనులు, మొయినాబాద్ మండలంలోని చిలుకూరు రెవెన్యూలో మొయినాబాద్, కేతిరెడ్డిపల్లిలో రైతు వేదికలను ప్రారంభించారు. చిలుకూరు రెవెన్యూలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు.
కాళేశ్వరంతో సాగునీరు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు నీరందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గోదావరి నదిపై కాళేశ్వరంను నిర్మించారని అన్నారు. తెలంగాణలో అద్భుతం… నదినే మళ్లించారు, మూడు ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. ప్రతి ఎకరాకు సాగు నీరందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. త్వరలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తిచేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ప్రతి నెలా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు రూ.308 కోట్ల నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా వానకాలం సీజన్కు 60 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించామన్నారు. ఏడాదికి రూ.15వేల కోట్ల పై చిలుకు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు స్పష్టంచేశారు. రైతుల కోసం రాష్ట్రంలో 2,604 రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.
రైతుల కోసం, పేదల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద పెద్ద కంపెనీలను మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేయించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యల సహకారంతో చందనవెళ్లిలో ఏర్పాటైన వెల్స్పన్ కంపెనీతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో మత్స్యకారులు, ముదిరాజ్లకు ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3825 కోట్లతో 1200 చెక్డ్యామ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రైతుల నుంచి ఇప్పటి వరకు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరు అందించాలని సీఎం సంకల్పించారన్నారు. జీవో 111 ఎత్తివేతకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
మొయినాబాద్ మండల ప్రజలు భూములు అమ్ముకోవద్దని, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పొన్న స్వప్నారెడ్డి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మి, ఆర్డీవో వేణుమాధవ్రావు, ఎంపీడీవో అనురాధ, ఏఓ వెంకటేశం, ఎంపీఓ హన్మంత్రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ షాబాద్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, చిలుకూరు సర్పంచ్ స్వరూప, కనకమామిడి సర్పంచ్ జనార్దన్రెడ్డి, ఎంపీ పీ జి.నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ ఎం చంద్రారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు కె.నరోత్తంరెడ్డి, ఎంపీటీసీలు సునీత, పార్వతమ్మ, మధు, కరుణాకర్, మాజీ జడ్పీటీసీలు కె.అనంతరెడ్డి, చంద్రలింగంగౌడ్, కె.భాస్కర్, ఏవో రాగమ్మ, తహసీల్దార్ అనిత, ఎంపీడీవో విజయలక్ష్మి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ మొయినాబాద్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, నాయకులు నర్సింహారెడ్డి, దారెడ్డి అండ్రూ కృష్ణారెడ్డి, డి.వెంకట్రెడ్డి, అంజిరెడ్డి, సర్పంచ్లు దారెడ్డి శోభ, లావణ్య, మనోజ్కుమార్, స్వప్నకుమారి, ఎంపీటీసీ రాంరెడ్డి, నాయకులు కోట్ల మహేందర్రెడ్డి, జడల రాజేందర్గౌడ్, నర్సింహారెడ్డి, పీసరి సతీశ్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, కిషన్రావు, రాందేవ్యాదవ్, సర్పంచులు పెంటయ్య, రాములు, కృష్ణాగౌడ్, శ్రీనివాస్గౌడ్, శ్రీధర్రెడ్డి, వెంకట్రెడ్డి, మల్లారెడ్డి, జీవన్రెడ్డి, యాదిరెడ్డి, పాండు, నారాయణరెడ్డి, శ్రీశైలం, క్యామ నారాయణ పాల్గొన్నారు.