ఈ నెల 25న మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభం
షాబాద్, జూన్ 19 : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి కలిశారు. శనివారం నగరంలో మంత్రితో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్తు చైర్పర్సన్ అనితారెడ్డిని జడ్పీటీసీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండలానికి సంబంధించిన అభివృద్ధి పనులు వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ నెల 25వ తేదీన మండలానికి మంజూరైన తిర్మలాపూర్-రేగడిదోస్వాడ బీటీ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభోత్సవంతో పాటు, తాళ్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనం, ఈసీ వాగులో చెక్డ్యామ్ పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు.