అభివృద్ధి పనులకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిదా
గున్గల్ గ్రామంలో పర్యటించిన సందీప్కుమార్ సుల్తానియా
యాచారం, ఏప్రిల్ 19 : మండలంలోని గున్గల్ గ్రామంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా సోమవారం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ఫిదా అయ్యారు. గ్రామంలో ఆసరా పథకం పింఛన్ల పంపిణీ విధానాన్ని ఆయన లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ సకాలంలో అందుతుందా లేదా.. చిల్లరతో కలిపి పూర్తి డబ్బులు చెల్లిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామాన్ని పరిశీలించారు. రేషన్ దుకాణాన్ని సందర్శించి, రేషన్ సరుకుల పంపిణీ తీరును ఆయన తెలుసుకున్నారు.
గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం పనులపై ఆరా తీశారు. ఎంపీడీవోను వివరాలను అడిగారు. గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి పనులు భేషుగ్గా ఉన్నాయని ఆయన కితాబిచ్చారు. పెండింగ్ పింఛన్లు, రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఎంపీపీ కొప్పు సుకన్య ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి దిలీప్కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ప్రభాకర్, ఏపీడీ జోగిరెడ్డి, ఎంపీపీ సుకన్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో మమతాబాయి, ఎంపీవో శ్రీలత, సర్పంచ్ ఇందిర, సింగిల్ విండో డైరెక్టర్ రాజేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…