షాద్నగర్రూరల్ : ఇప్పటి కాలంలో 60 నుంచి 70 సంవత్సరాలు బ్రతకడమే కష్టం. అటువంటిది ఏకంగా ఓ బామ్మ 106 బ్రతికి మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచింది. తుది శ్వాస విడిచేంత వరకు తన పని తాను చేసుకుని అందరి మెప్పు పొందింది. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్నగర్ మండలంలోని దూసకల్ గ్రామానికి చెందిన బిస్మిల్లాబీ (106) వృద్ధురాలు మంగళవారం రాత్రి మృతి చెందింది. అందరిని అప్యాయంగా పలుకరించే బిస్మిల్లాబీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంపై గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్లిన వారి యోగక్షేమాలను అడిగేవారని, మంచికి, ప్రేమకు మారుపేరుగా నిలిచిన బిస్మిల్లాబీ మృతి చెందడం తీరని లోటని గ్రామస్తులు బాధను వ్యక్తం చేస్తున్నారు.