మొయినాబాద్, ఏప్రిల్7: పిల్లల ఉజ్వల భవిష్యత్కు అక్షరమే ఆయుధమని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. దేశ రక్షణలో అమరులైన వీరజవానుల జ్ఞాపకార్థం, ప్రపంచ ఆరోగ్య దినోత్స వా న్ని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఫౌండేషన్, స్వేరో నెట్వర్క్, స్వేరో సర్కిల్ల సంయుక్త సహకారంతో రెడ్క్రాస్ సొసైటీ సౌజన్యంతో తలసీమియా వ్యాధిగ్రస్తు లకు బుధవారం మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యా రు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీ ణ్కుమార్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక్క సారి రక్త దానం చేయాలని, రక్తదానం చేయడంలో ఎవరికి ఎలాంటి అపోహలు వద్దని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించి ఉన్నత శిఖరాలను అధి రోహించడానికి ప్రోత్సహించాలని చెప్పారు. కార్యక్ర మంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ కోంపల్లి అనంతరెడ్డి, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, మాజీ సర్పంచ్లు గీతా వనజాక్షి, సత్యనారాయణ, స్వేరో ఇంటర్నేషనల్ రాష్ట్ర వైస్ చైర్మ న్ కె విజయ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె స త్యం, ఎం లక్ష్మణ్, స్వేరో సర్కిల్ జిల్లా అధ్యక్షుడు లింగం, ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు, స్వేరో నెట్వర్క్ జిల్లా అధ్య క్షుడు కె శ్రీధర్, ఫిట్ ఇండియా జిల్లా అధ్యక్షుడు నిరం జన్, టీజీపీఏ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసుజాత, స్వేరో సర్కిల్ మండల అధ్యక్షుడు రమేశ్, ఫిట్ ఇండియా మం డల అధ్యక్షుడు యాదగిరి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజేశ్ పాల్గొన్నారు.