కొందుర్గు, ఏప్రిల్ 30 : మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఏఈవో సుధారాణి శుక్రవారం పరిశీలించారు. మండలంలోని చెర్కుపల్లి, గంగన్నగూడ, చెక్కలోనిగూడ గ్రామాల్లో వరి పంట 50శాతం దెబ్బతిన్నట్లు వివరించారు. దెబ్బతిన్న పంట వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఏఈవో తెలిపారు. రైతులకు సహాయం అందేవిధంగా కృషి చేయనున్నట్లు వివరించారు.