షాబాద్ : తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియోషన్ (ట్రెసా) జిల్లా కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు. కార్యక్రమంలో ట్రెసా సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, కార్యదర్శులు గౌతమ్కుమార్, మన్నె ప్రభాకర్, నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శుక్లకుమార్, కార్యదర్శి జనార్దన్రావు, రహమాన్, అనితారెడ్డి, ఇతర డివిజన్లకు సంబంధించిన రెవెన్యూ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.