తాండూరు, మే 24: పంట సాగులో నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగు బడులు వస్తాయని తాండూరు వ్యవసాయ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుధా రాణి, ప్రవీణ్ పేర్కొన్నారు. మంగళవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన మేళాను నిర్వహించారు. వానకాలం సీజన్లో సాగు చేసే కంది పంటకు ఎండు తెగులు, గొడ్డు తెగులు సోకకుండా, అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా తాండూరు వ్యవసాయ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుధారాణి, ఏరువాక కేం ద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రవీణ్ మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు.
జంట సాగు పద్ధతిలో కంది సాగు చేస్తే దిగు బడులు బాగుంటాయన్నారు. యాంత్రీకరణ, డ్రోన్లను ఉపయోగించాల న్నారు. డ్రోన్తో మందులు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నా రు. ఎకరాకు 150 లీటర్ల మందు, సుమారు మూడు గంటల సమయంలో పిచికారి చేయవచ్చన్నారు. డ్రోన్ వల్ల తక్కువ సమయంతో పాటు మందు కూడా చాల తక్కువ పడుతుందన్నారు. తాండూరు వ్యవసా య పరిశోధన కేంద్రంలో తెలంగాణ కంది-3 (టీడీఆర్జీ-59), హనుమ (టీడీఆర్జీ-4), ఆశ (ఐసీపీఎల్ 87119) కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేజీ 130 చొప్పున 4 కేజీల కంది విత్తనాల బస్తా రూ. 520 ధర ఉందన్నారు. రైతులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు యమునారెడ్డి, సందీప్, మిన్ని, వ్యవవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.