ఇబ్రహీంపట్నంరూరల్, మే 19 : ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దండుమైలారం సహకార సంఘం వైస్చైర్మన్ కాంటేకార్ ఈశ్వర్, రాయపోల్ సర్పంచ్ బల్వంత్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులను ఓవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సంతోషకరమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, ఉపసర్పంచ్ బాలరాజు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలగౌడ్ పాల్గొన్నారు.
తలకొండపల్లి, మే 19 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.