పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు చుక్కలు వేయించాలని ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులతో కలిసి ఎమ్మెల్యేలు ప్రారంభించారు. నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి వేయించాలన్నారు.
కడ్తాల్,ఆమనగల్లు ఫిబ్రవరి 27 : పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోలి యో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వేర్వేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనం ద్, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, కృష్ణయ్యయాదవ్, రవీందర్రెడ్డి, భారతమ్మ, సులోచన, విజయలక్ష్మి, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, ప్రియ, నాయకులు హన్మానాయక్, భాస్కర్రెడ్డి, శేఖర్గౌడ్, జహంగీర్అలీ, నరేశ్నాయక్, కృష్ణ, జైపాల్, కుమార్, ప్రభులింగం, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
షాబాద్ : గ్రామాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పల్స్పోలియో చుక్కలు వేయించాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో ప్రజాప్రతినిధులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బృందం, ఫిబ్రవరి 27 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదివారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్పోలియోకు చక్కటి స్పందన లభించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 62,127మంది పిల్లలకు చుక్కల మందులు వేయాల్సి ఉండగా ఆదివారం రికార్డుస్థాయిలో చుక్కల మందు వేశారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఉన్న ఇటుకబట్టీల వద్ద సుమారు 700 మంది చిన్నపిల్లలు ఉండగా, వైద్యారోగ్యశాఖ సిబ్బంది బట్టీల వద్దకే వెళ్లి చుక్కల మందులు వేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, పలువురు కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో చుక్కలమందు వేశారు. పోలియో నిర్మూలన కోసం తల్లిదండ్రులు చిన్నారులకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే అన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండ్లో డిప్యూటీ డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో ఎంపీపీ కృపేశ్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, సర్పంచ్ అశోక్వర్ధన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి ఉప్పరిగూడలో చుక్కల ముందులు వేశారు. అబ్దుల్లాపూర్మెట్లో ఎంపీపీ బుర్ర రేఖగౌడ్ పోలియో చుక్కలు వేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో చైర్పర్సన్ కొత్త ఆర్తిక, వైస్ చైర్మన్ కోరె కళమ్మను చుక్కల మందుల పంపిణీలో పాల్గొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలోని కొంగరకలాన్లో డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి, వైద్యాధికారి అభిరాం పాల్గొన్నారు.
పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పుదాం
– ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్
షాద్నగర్టౌన్, ఫిబ్రవరి 27: చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేయించి, పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పుదామని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రం వద్ద ఆదివారం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్తో కలిసి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ప్రభుత్వ దవాఖానలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. వివిధ వార్డుల్లో కౌన్సిలర్లు, నాయకులు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్, అధికారి శ్రీహరి, డాక్టర్ వసంతలీల, సూపర్వైజర్ భారతి, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తూరు : పోలియో మహమ్మారిని దేశం నుంచి తరమికొడుదామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పిలుపునిచ్చారు. కొత్తూరు మున్సిపల్ చైర్పర్పన్ లావణ్య ఆధ్వర్యంలో కొత్తూరు బస్టాండ్ వద్ద చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు దేవేందర్యాదవ్, యాదయ్య, బాల్రాజు పాల్గొన్నారు.
హయత్నగర్ రూరల్ : పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని పలు వార్డులతోపాటు అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట గ్రామాల్లో ఆదివారం ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు మర్పల్లిలో పాశం అర్చన, ఆర్కేనగర్లో కోటేశ్వర్రావు, తట్టిఅన్నారంలో దేవిడి గీత, ఇందు పల్లవిలో తొండాపు రోహిణిరెడ్డి పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంచాల : ఎంపీపీ జాటోతు నర్మద, జడ్పీటీసీ నిత్య వివిధ గ్రామాల్లో పల్స్పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ప్రసాద్, సతీశ్, వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : ముడిమ్యాల గ్రామంలో సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్, ఆలూరు గ్రామంలో టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు తోట శేఖర్, గొల్లపల్లి, అంతారం, కౌకుంట్ల, తల్లారం, దుద్దాగు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు చిన్నారులకు పోలియో టీకా వేశారు.
యాచారం : మండల కేంద్రంలో ఎంపీపీ సుకన్య, మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, హెచ్ఈవో శ్రీనివాస్ మాల్లో జడ్పీటీసీ జంగమ్మ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశవర్కర్లు 0-5సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. మొత్తం 44 బూతుల ద్వారా 5743 మంది చిన్నారులకు గాను 5,535మంది చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.
కొందుర్గు : జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఎంపీపీ యాదమ్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 7838 మందికి గాను 7440మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హాఫీజ్, శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, జబ్బార్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పల్స్పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలి యో చుక్కలను వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మెన్ గణేశ్, సర్పంచ్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్ : చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చాలని ఎంపీపీ మధుసూదన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ దామోదర్ ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. కొడిచర్లలో, పెంజర్ల గ్రామంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బొంతల రవీందర్రెడ్డి, పెంజర్ల సర్పంచ్ మామిడి వసుంధర ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ అంజమ్మ పాల్గొన్నారు.
కేశంపేట :ఎక్లాస్ఖాన్పేటలో ఎంపీపీ రవీందర్యాదవ్, పాపిరెడ్డిగూడలో జడ్పీటీసీ విశాల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మొదటి రోజు 3935 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంల్లో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి, వైద్యాధికారులు డాక్టర్ దామోదర్, సుమంత్ పాల్గొన్నారు.