ఆమనగల్లు, ఫిబ్రవరి 26 : ఆమనగలు ్లమండల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు బ్లాక్ మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, బీజేపీ నాయకులు అడ్డుపడడం మానుకోవాలన్నారు. శనివారం ఆమనగల్లు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం ఇంటర్ బోర్డు ద్వారా రూ.2 కోట్ల నిధులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గత 20 ఏండ్ల కింద పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రజల సహకారంతో విరాళాలు సేకరించి కళాశాలకు స్థలం కోనుగోలు చేశామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. శనివారం కళాశాల భవన నిర్మాణం కు ఇంటర్ బోర్డు రూ. 2కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 14 ఆధునాతన తరగతి గదులు, టాయిలెట్లు, ప్రహరీ నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే పట్టణంలో రూ.కోటి నిధులతో మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణం కొన సాగుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ఆరుకొన్ని నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఆమనగల్లు -మాడ్గుల, ఆమనగల్లు-తలకొండపల్లి మండలాల ప్రధాన రహదారుల కోసం నాలుగు లేన్ల రోడ్డు విస్తరణకు రూ.37 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. విస్తరణలో భాగంగా పట్టణంలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయేవారికి ప్రభుత్వం నష్టపరిహారం కింద డబ్బులు ఇవ్వడంతో పాటు డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేయనున్నదని తెలిపారు.
రాజ్యాంగ హోదా పదవుల్లో ఉంటూ బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏమిటని ఎన్బీసీ మెంబర్ ఆచారి పై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా హోదాకు గౌరవం పెంచేలా వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు నారాయణ, జోగు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు సుభాష్, రమేశ్నాయక్, అప్పం శ్రీను, రఘు, నిరంజన్, వెంకటయ్య, భీమయ్య, కిరణ్, సత్యం, భాస్కర్, రవి పాల్గొన్నారు.