తాండూరు రూరల్, జూలై 21: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని తాండూరు ఎంపీపీ అనితాగౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మల్కాపూర్ జడ్పీహెచ్ఎస్, కోటబాసుపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు యూని ఫాం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్నారు. జడ్పీటీసీ సభ్యు రాలు గౌడి మంజుల మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ స్వరూప మా ట్లా డుతూ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్య క్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్యగౌడ్, సర్పంచ్లు విజయలక్ష్మి, నాగార్జున, హెచ్ఎంలు వైద్యానాథ్, మృత్యుంజయస్వామి, శ్రీనివాస్, నాగప్ప, పీఆర్టీయూ నాయ కులు జయపా ల్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్లు ఉన్నారు. మల్కాపూర్, జినుగుర్తి, కరణ్ కోట పాఠశాలలో టెన్త్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పీఆర్టీయూ నేత జయపాల్ రెడ్డి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ బహుకరించారు.
విద్యార్థులు చదువుల్లో రాణించాలి
పెద్దేముల్, జూలై 21 : విద్యార్థులు చదువుల్లో రాణించాలని పెద్దేముల్ గ్రామ సర్పంచ్ ద్యావరి విజయమ్మ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ప్రమీల,ప్రధానోపాధ్యాయులు శాంతప్ప,ఉపాధ్యాయులు ద్యావరి నరేందర్ రెడ్డి, ప్రభాకర్, సంధ్యారాణి, మంజుల, ఆనంద్ పాల్గొన్నారు.
దుద్యాల ప్రాథమిక పాఠశాలలో
బొంరాస్పేట, జూలై 21: దుద్యాల ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను ఎస్ఎంసీ చైర్మన్ కాశప్ప, హెచ్ఎం చందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్నదని విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రావణి, నిఖిల, వాణి, సీఆర్పి శశివర్ధన్ పాల్గొన్నారు.