భక్తుల కోలాహలం.. మేళతాళాలు… వేదపండితుల మంత్రోచ్ఛరణలు… భజన సంకీర్తనల నడుమ బుధవారం జిల్లా వ్యాప్తంగా గణనాథుడు కొలువుదీరాడు. పల్లెల్లో, వాడల్లో పలు ఆకృతుల్లో కొలువుదీరిన వినాయకునికి భక్తులు కుడుములు, ఉండ్రాళ్లు, లడ్డూలు, పండ్లు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. చక్కటి సెట్టిం గులతో ఏర్పాటు చేసిన లంబోదరుని మండపాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చాలా చోట్ల మట్టి విగ్ర హాలు, పేపర్తో చేసిన వినాయకులు దర్శనమిస్తున్నాయి.
గురువారం ప్రజాప్రతినిధులు ప్రత్యే క పూజలు చేశారు. వికారాబాద్పట్టణంలోని పలు వినాయక మండపాలలో వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ మం జుల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు వారికి సన్మానాలు చేశారు. తాండూరులో ఎమ్మె ల్సీ మహేందర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.వినాయక మండపాల వద్ద నిర్వాహకులు అన్నదానం చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు కొనసాగేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ