పరిగి, జూలై 9: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు అందుబాటులోకి మెరుగైన వైద్యం వచ్చిం దని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. పరిగి దవాఖానలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆపరేషన్ థియేటర్లో శనివారం వైద్యులు ఓ మహిళకు సిజేరియన్ ద్వారా ప్రసవం చేసిన విషయం తెలుసుకున్న ఆయన దవాఖానను సందర్శించి ఆ మహిళకు కేసీఆర్ కిట్ను అందించారు. చెంతనే నాణ్యమైన వైద్యం తో గర్భిణులకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన అన్నారు.
దవాఖాన పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటికే ఈ దవాఖానలో సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. కానీ ప్రసవ సమయంలో ఏదైనా ఇబ్బంది కలిగి సిజేరియన్ చేయాల్సి వస్తే వికారాబాద్ లేదా హైదరాబాద్లోని దవాఖానలకు గర్భిణులకు తరలించాల్సి వచ్చేది. దీంతో గర్భిణులకు ఇబ్బందిగా ఉండటంతో పరిగిలోని దవాఖానలో నే ఆపరేషన్ థియేటర్ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి జూన్ 16న ప్రారంభించారు. తద్వారా సిజేరియన్ ప్రసవాలు చేసేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.