రంగారెడ్డి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిషరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 114 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ శశాంకతోపాటు అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిషరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల సత్వర పరిషారం కోసం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు పంపిస్తున్నారని, జిల్లాకు 5 వేల పైచిలుకు దరఖాస్తులను పంపించారని తెలిపారు. అందులో 2 వేల దరఖాస్తులు హౌసింగ్, 500 దరఖాస్తులు పెన్షన్, 1300 దరఖాస్తులు భూసమస్యలకు సంబంధించినవి కాగా.. మిగిలిన అర్జీలు ఇతర వాటిపై అందాయని తెలిపారు.
దరఖాస్తులను ఆనె్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఒకవేళ వినతులు పరిషారం కానట్లయితే, అందుకు గల కారణాలను స్పష్టంగా పేరొనాలని సూచించారు. అధికారులందరూ ఈ-ఆఫీసు ద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా జిల్లా స్థాయి శాఖలకు, సామాజిక మాధ్యమంలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సంగీత, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండలస్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులున్నారు.