జవహర్నగర్, ఫిబ్రవరి 10 : మనిషి జీవితం దారంలాంటిదని, దారం తెగితే అతుకులే మిగులుతాయని టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, రాచకొండ సీపీ సుధీర్బాబు, సైబరాబాద్ సీసీ మహంతి అన్నారు. హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుద్దామని పిలుపునిచ్చారు. బిట్స్ పిలానీ క్యాంపస్లో యాంటీ డ్రగ్స్పై రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు హాజరై ప్రసంగించారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు.
మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 12మందిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేసి రూ.5కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నామని చెప్పారు. కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధకంపై కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తామని తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూఎస్ కాన్సులెట్ అధికారి ఎర్న్ఫిషర్, సీఐలు సీతారాం, రాములు, డీఐ శ్రీనివాస్, ఎస్సైలు అనిల్యాదవ్, అనిల్కుమార్, వేణు, పోలీసులున్నారు.