పెద్దఅంబర్పేట, డిసెంబర్ 4: మున్సిపాలిటీ 4వ వార్డులోని సాయినగర్ కాలనీ ఫేస్-3లో శివప్రసాద్రెడ్డి ఇంటినుంచి పడమటి చంద్రారెడ్డి ఇంటివరకు రూ.5 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వార్డులో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. పనులు నాణ్యతగా చేపట్టా లని, సకాలంలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్ర మంలో విజేందర్రెడ్డి, అమురం మల్లారెడ్డి, చంద్రారెడ్డి, తాటిచెట్టు రమే శ్, మోహన్రెడ్డి, పడమటి సుధాకర్రెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.