చుక్కల మందుతో చక్కని జీవితమని ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు చుక్కల మందు వేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు.
ఇబ్రహీంపట్నం, మార్చి 3 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పల్స్పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో ధరణికుమార్ మాట్లాడుతూ..0-5సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలియో కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు చుక్కలు వేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేరారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పుదాం
షాద్నగర్టౌన్ : ప్రతి చిన్నారికీ పల్స్ పోలియో చుక్కలను వేయించి పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పుదామని జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ నరహరి అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మితో కలిసి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్స్ పోలియో చుక్కలు చిన్నారుల జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు. ప్రభుత్వ దవాఖానతో పాటు పలుకాలనీల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్ల వద్ద చిన్నారులకు కౌన్సిలర్లు, నాయకులు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఎంఎల్హెచ్పీ వైద్యాధికారి సంధ్య, హెల్త్ సూపర్వైజర్ శ్రీరామ, ఏఎన్ఎంలు శిరీష, సునీత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అంగన్వాడీ టీచర్ ఉమారాణి తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కులు వేశారు. చేవెళ్ల బస్టాండ్, హౌసిం గ్ బోర్డు, ప్రభుత్వ దవాఖాన, పంచాయతీ కార్యాలయా ల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
కడ్తాల్ : పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వారు ప్రారంభించారు. పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు చందోజీ, లాయక్అలీ, బీచ్చానాయక్, నర్సింహ, జహంగీర్అలీ, రామచంద్రయ్య, లక్ష్మయ్య, నాగార్జున, భూమయ్య, సురేశ్, అంజి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, వైద్యులు కిరణ్కుమార్, సంపూర్ణాదేవి, స్రవంతి, సుబ్రమణ్యం, హెచ్ఈవో సుధీర్బాబు, ఏన్ఎంలు పుష్ప, రమాదేవి, ఆశ వర్కర్లు లావణ్య, జ్యోతి, తిరుపతమ్మ, సబిత తదితరులు పాల్గొన్నారు.
మంచాల : మండలంలోని వివిధ గ్రామాల్లో పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు పల్స్పోలియో కేంద్రాలకు వెళ్లి చుక్కల మందులను వేయించారు. మండలంలో 40 పోలింగ్ కేంద్రాల్లో నాలుగు రూట్లను ఏర్పాటు చేయగా.. అందులో ఒక మొబైల్ వ్యాను కూడా ఏర్పాటు చేశారు. మంచాల, ఆరుట్ల ప్రాథమిక వైద్య కేంద్రాల్లో 4800 మందికి చుక్కలు వేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు చీరాల రమేశ్, శేఖర్రెడ్డి, కావలి శ్రీనివాస్, అనిత, నరేందర్రెడ్డి, రాందాస్, రాజేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : చిన్నారుల చక్కని భవిష్యత్కు పోలియో చుక్కలు తప్పనిసరి అని మండల వ్యవసాయ అధికారి, బస్తేపూర్ గ్రామ ప్రత్యేక అధికారి తులసి అన్నారు. పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో భాగంగా ఆమె బస్తేపూర్ గ్రామంలో ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవ్దాస్, అంగన్వాడీ టీచర్ స్వప్న, ఆశ వర్కర్ మాలతి, అంగన్వాడీ ఆయా చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో గల బ్రిలియంట్ పాఠశాలలో పోలియో కేంద్రం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, నాయకులు సత్యనారాయణ, షకీలబేగం, ప్రవళిక, పావని, స్వప్న పాల్గొన్నారు.
శంకర్పల్లి : దేశంలో పోలియో రహిత సమాజాన్ని స్థాపించాలని ఎంపీడీవో వెంకయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. బస్టాండ్ ఆవరణలో పోలియో చుక్కలను వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది అంజనీకుమార్, అశోక్, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాచారం : పోలియో రహిత సమాజమే ధ్యేయంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం మండలంలో విజయవంతమైంది. వైద్యులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశవర్కర్లు, దవాఖాన సిబ్బంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. మొత్తం 44 బూత్ల ద్వారా 5810 మంది చిన్నారులకు గాను 5636 మందికి చుక్కల వేశారు. ఆదివారం పోలియో చుక్కలు వేసుకోని చిన్నారులకు సోమవారం ఇంటింటికి తిరిగి వేయనునట్లు మండల వైద్యాధికారిణి రాజ్యలక్ష్మి తెలిపారు.
కొత్తూరు : రెండు చుక్కల మందు వేసుకోవడం వల్ల చిన్నారులు చక్కని జీవితాన్ని పొందుతారని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి హరికిషన్, సూపర్ వైజర్ చిట్టిబాబు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్, ఆశ వర్కర్లు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఆమనగల్లు : మండల వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్లు, ఆమనగల్లు బస్టాండ్లో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ పరీక్షిత్ నరేందర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్వో తిరుపతిరెడ్డి, సూపర్ వైజర్ శ్రీనివాస్, ఆశ వర్కర్ సల్మా, అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
నందిగామ : నందిగామలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, చేగూరులో ఎంపీపీ ప్రియాంకగౌడ్, ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది ప్రారంభించారు. చిన్న పిల్లలకు తప్పని సరిగా చుక్కలను వేయించాలని సూచించారు.
మొయినాబాద్ : సంపూర్ణ ఆరోగ్యానికి పోలియో చుక్కలు ఎంతో దోహదపడుతాయని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన చిన్నారులకు చుక్కల మందు వేశారు.