కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడు తండా పంచాయతీకి చెందిన కల్యాణీకి రూ.1లక్ష ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరైంది. శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో లబ్ధిదారురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకందరికీ కార్పొరేట్ దవాఖానల్లో అత్యుత్తమ వైద్యం అందుతున్నదని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతోమంది పేదలకు వరంలా మారిందని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు ఎంపీపీ అనిత, నాయకులు భాస్కర్రెడ్డి, విజయ్, వేణుగోపాల్, పత్యానాయక్, సాజ్యానాయక్, సురేందర్రెడ్డి, బిక్కునాయక్, శ్రీనునాయక్, రాములు యాదవ్ పాల్గొన్నారు.