తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని లష్కర్గూడ, ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. కంపెనీల ఏర్పాటుతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదన్నారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మొద్దన్నారు. ఈసారి కూడా ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
– ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 3
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 3 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ, ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామాలకు చెందిన వివిధపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, అందులో భాగంగానే రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, రుణమాఫీ, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, మిషన్భగీరథ ద్వారా తాగునీరు, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల ముందే ప్రజల వద్దకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తూ లబ్ధిపొందాలనుకునే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల అధ్యక్షుడు కిషన్గౌడ్, ఎంపీటీసీ సాయి, సర్పంచ్ పారిజాత శేఖర్, గ్రామాధ్యక్షుడు మల్లేశ్, పోల్కంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్, నాయకులు నర్సింహ, రవీందర్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు షరీఫ్, నాయకులు దానయ్య, యాదయ్య, మైసయ్య, పోచయ్య, జంగయ్య పాల్గొన్నారు.