కులకచర్ల, ఫిబ్రవరి 3 : విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అన్నారు. శనివారం కులకచర్ల మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్లాక్-2 అధ్యక్షుడు కర్రె భరత్కుమార్ సొంత డబ్బులతో పదో తరగతి విద్యార్థినులకు స్టడీమెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. విద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని, విద్యలేనివారికి సమాజంలో గుర్తింపు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. స్టడీ మెటీరియల్ దాత కర్రె భరత్కుమార్ మాట్లాడుతూ.. పేదలకు తన వంతుగా సహాయం అందిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఎంఈవో హబీబ్ అహ్మద్, ఎస్సై శ్రీశైలం, ఎంపీటీసీ ఆనందం, నాయకులు కనకం మొగులయ్య, వెంకటయ్యగౌడ్, వెంకటేశ్, ఎల్లయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, విష్ణు, వెంకట్రాములు, వెంకట్, మురళి, రమేశ్, గణేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.