ఆమనగల్లు, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై ప్రధాని మోదీ రాజ్య సభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ డిమాండ్ చేశారు. ఆమనగల్లు , మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో దిష్టిబొమ్మలతో ఊరేగింపు నిర్వహించి దహనం చేశారు. కడ్తాల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, పార్టీ ఆమనగల్లు మండల అధ్యక్షుడు అర్జున్రావు, తలకొండపల్లి మండలంలో శంకర్, మాడ్గుల మండలంలో జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిరసనలో పాల్గొన్నారు. అనంతరం బైకు ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు బీజేపీ, ప్రధాని మోదీ విషం చిమ్ముతూనే ఉన్నారన్నారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటులో తామూ మద్దతు ఇచ్చామని ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజల ఓట్ల కోసమే బీజేపీ నాయకులు ఆడుతున్న డ్రామాలకు నేటితో తెరపడిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్, సింగిల్విండో చైర్మన్ గంప వెంకటేశ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, డైరెక్టర్ సుభాశ్, సర్పంచ్ శ్రీను, కడ్తాల్ మండలంలో సర్పంచ్ ఎల్ఎన్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, రైతుబంధు సమితి అధ్యక్షుడు వీరయ్య పాల్గొన్నారు.
– ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య
షాబాద్, ఫిబ్రవరి 9: ఎనిమిదేండ్ల పాలనలో కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు చేవెళ్లలో బీజాపూర్-హైదరాబాద్ రహదారిపై పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. షాబాద్లో జడ్పీటీసీ అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో ముంబయి-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించి దహనం చేశారు. మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రధాని మోదీ తెలంగాణపై లేనిపోని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రధాని మాట్లాడటం దారుణమన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీలు మర్పల్లి మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, గోవర్ధ్దన్రెడ్డి, నక్షత్రం, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు నర్సింగ్రావు, ప్రభాకర్, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వప్నారెడ్డి, శివనీల, బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ డప్పు రాజు, డైరెక్టర్ యాదయ్య, నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొంపల్లి అనంతరెడ్డి, జడల రాజేందర్గౌడ్, చాంద్పాషా పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్నగర్ : ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజలపై ఎందుకు అంత అక్కసు అని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలిపారు. చౌదరిగూడ మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాల అనంతరం సమాఖ్య స్ఫూర్తి పేరుతో మాటల గారడీ చేస్తూ అర్థం లేని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాత్రికి రాత్రే తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రలో కలుపడం ఏ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమో చెప్పాలని డిమాండ్ చేశారు. షాద్నగర్ పట్టణ ముఖ్యకూడలిలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ రవీందర్యాదవ్, కొందుర్గు మండల కేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, కొత్తూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, నందిగామ మండల కేంద్రంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు నిరసనలు తెలిపి ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, నాయకులు విశ్వం, యుగేందర్, ప్రతాప్రెడ్డి, రాఘవేందర్, శరత్, రామకృష్ణ, రవీందర్రెడ్డి, దేవేందర్, యాదగిరి, మాధవరెడ్డి, రమేశ్, శ్రీరాములు, సాయిలు, బాలయ్య, లక్ష్మయ్య, శేఖర్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం, రాయపోల్తో పాటు తదితర గ్రామాల్లో ప్రధానమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారులను కించపర్చటమేనని అన్నారు. దండుమైలారంలో తెలుగుతల్లి విగ్రహం వద్ద సర్పంచ్ మల్లీశ్వరి, సహకార సంఘం చైర్మన్ వెంకట్రెడ్డి, నాయకులు జగదీశ్, మంగ ఐలేశ్ తదితరులు పాల్గొన్నారు.