షాబాద్, డిసెంబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. శనివారం నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా పథకాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు తమ ఆధార్కార్డులు, రేషన్కార్డులు జిరాక్స్లు తీసుకుని వెళ్తున్నారు.
దీంతో జిరాక్స్ కేంద్రాల వద్ద, ఫొటో స్టూడియోల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఆది, సోమ వారాల్లో ప్రజాపాలన కార్యక్రమానికి సెలవు ఉందని, మళ్లీ జనవరి 2వ తేదీన ఆయా గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఎల్పీవో అమృత, ఎంపీడీవోలు అనురాధ, హిమబిందు, సంధ్య, వెంకయ్య, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, ఏవోలు వెంకటేశం, తులసి, రాగమ్మ, సర్పంచ్లు నర్సింహారెడ్డి, చంద్రశేఖర్, సంధ్య, మహేందర్రెడ్డి, శకుంతల, స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ : ప్రజల సంక్షేమం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, సర్పంచ్ నర్సింహులు, ఉప సర్పంచ్ సీతారాం, ఎంపీటీసీలు కట్న లత, కుమారస్వామిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
కొత్తూరు : జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మండల పరిధిలోని ఇన్ముల్నర్వలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణను ఎమ్మెల్యే ప్రారంభించారు. దర్గా అభివృద్ధిని సాధ్యమైనంత త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, పేదలందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి, సర్పంచ్ అజయ్నాయక్, ఎస్బీపలి సర్పంచ్ అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హరినాథ్రెడ్డి పాల్గొన్నారు.
కొత్తూరు : ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజా పాలన స్పెషల్ ఆఫీసర్(రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్) శ్రీదేవి అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీని సందర్శించారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్తూరు మున్సిపాలిటీలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీరణకు మంచి స్పందన ఉందన్నారు. అధికారులు కూడా భాగా పనిచేస్తున్నారని ఆమె కితాబునిచ్చారు. అనంతరంకొత్తూరులో నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ భవనాన్ని సందర్శించారు. కార్యక్రమంలో మన్సిపల్ కమిషనర్ వీరేందర్, నాయకులు దేవేందర్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను అర్హులందరికీ అందజేస్తామని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అన్నారు. మైసిగండి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తలకొండపల్లి మండలంలోని వెంకటాపురం, అంతారం, మాదాయిపల్లి, చౌదర్పల్లి, పెద్దూరు, పెద్దూరు తండాలో నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ముంతాజ్, రంగారెడ్డి, ఎంపీడీవోలు రామకృష్ణ, శ్రీకాంత్, డీటీ వినోద్కుమార్, సర్పంచ్లు శ్వేత, పాండు, రాములు, రమేశ్యాదవ్, వెంకటయ్య, హైమావతి, శ్రీశైలం, సక్రి, చంద్రయ్య, ఏఈలు పరమేశ్, నరేందర్, ఏవో శ్రీలత, ఎంపీవోలు మధుసూదనాచారి, రఘు, ఏఈవో రమణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
యాచారం : అయ్యవారిగూడ, నందివనపర్తి గ్రామాలలో ఎంపీడీవో విజయలక్ష్మి, కేసీతండా, మంథన్గౌరెల్లి గ్రామాల్లో ఎంపీవో ఉమారాణి ప్రజాపాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్ :అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో వినయ్కుమార్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని అన్నారం, విఠ్యాల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. దరాఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు అన్ని వసతులను సమకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములుగౌడ్,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : అభయహస్తం గ్యారెంటీలకు మున్సిపాలిటీలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మూడోరోజు 24 వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించారు. పెద్దఅంబర్పేటలోని సెంటర్ను కమిషనర్ ఎస్ రవీందర్రెడ్డి సందర్శించారు. స్థానిక కౌన్సిలర్ పసుల రాజేందర్తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. 14వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ రోహిణిరెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మర్రిపల్లిలో కౌన్సిలర్ పాశం అర్చన దరఖాస్తులు స్వీకరించారు.
ఆమనగల్లు : మున్సిపాలిటీలోని 7, 8, 9 వార్డులతోపాటు మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామంలో అధికారులు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రంమలో సర్పంచ్ రజిత, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ నిట్ట నారాయణ, ఎంపీడీవో ఫారూఖ్హుస్సేన్, ఎంపీవో శ్రీలత, అధికారులు పాల్గొన్నారు.
మంచాల : గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన స్వీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. లోయపల్లిలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖా౦స్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎల్లంకి అనితతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ కాశీవిశ్వనాథ్, ఈవోపీఆర్డీ తేజ్సింగ్, వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : కవాడిపల్లి, చిన్నరావిరాల, లష్కర్గూడ గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను జడ్పీటీసీ బింగి దాస్గౌడ్, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్రెడ్డి, ఎంపీడీవో మమతాబాయి, తహసీల్దార్ రవీందర్దత్తు, సర్పంచ్లు దూసరి సుజాత, సురకంటి వనజ, ఏసూరి పారిజాతతో కలిసి ఎంపీపీ బుర్ర రేఖ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు దంతూరి అనిత, సీక సాయికుమార్గౌడ్, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో 3200 దరఖాస్తులు స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ అమరేందర్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ మొత్తం 5 వేల దరఖాస్తు ఫారాలు ప్రతి ఇంటికి అందచేశామన్నారు.