వికారాబాద్ జిల్లా పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. జిల్లాలో మరో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తాండూరు మండలం జినుగుర్తి సమీపంలోని సర్వే నంబర్ 206లో ఇండస్ట్రియల్ పార్కు ను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇక్కడున్న 222 ఎకరాల్లో ఏర్పాటు చేయనుండగా.. గతంలో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, టీఎస్ఐఐసీ అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు సర్వేలు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కృషితో స్టోన్ వ్యాపారుల కల నెరవేరనున్నది.
-తాండూరు రూరల్, డిసెంబర్ 3
వీకెండ్..షికారు..
వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టుకు శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో చుట్టూ పక్కల జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలి వచ్చారు. యువత కోట్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ, సెల్ఫీలు దిగుతూ రోజంతా సరదాగా గడిపింది.
తాండూరు రూరల్, డిసెంబర్ 3: సుదీర్ఘ నిరీక్షణకు తెర పడనున్నది..తాండూరు స్టోన్ వ్యాపారుల కల నెరవేరనున్నది.. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కృషితో మండలానికి ఇండస్ట్రియల్ పార్కు రానున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గెజిట్ను కూడా విడుదల చేసింది. మండలంలోని జినుగుర్తి గ్రామ సమీపంలో సర్వేనంబర్ 206లోని 222 ఎకరాల భూమిలో ఇం డస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020 జూలై నెలలో టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు పలుమార్లు సర్వేలు నిర్వహించి టీఎస్ఐఐసీ కార్యాలయానికి భూమి వివరాలను అందించారు.
వికారాబాద్ జిల్లాలో స్టోన్ వ్యాపారం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నది. పన్నుల రూపంలో ప్రభు త్వానికి ప్రతిఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నది. నియోజకకర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో నాపరాతి గనులు విస్తరిం చి ఉన్నాయి. తాండూరు మండలం, ఓగిపూర్, కరణ్కోట, మల్కాపూర్, కోటబాసుపల్లి, సిరిగిరిపేట గ్రామాల్లో ..అదేవిధంగా బషీరాబాద్, జీవన్గీ, ఏక్మా యి తదితర గ్రామాల్లో నాపరాతి గనులున్నాయి. తాండూరు, చెన్గేశ్పూర్, గౌతాపూర్, కోకట్, కొడంగల్ రోడ్డు, అంతారం గ్రామ శివారుల్లో సుమారు రెండు వేలకుపైగా పాలిషింగ్ యూనిట్లు వెలిశాయి. ప్రతిరోజూ నాపరాయిని పాలిష్ చేసి దేశంలోని వివి ధ రాష్ర్టాలకు వ్యాపారులు రవాణా చేస్తుంటారు. కొం తమంది వ్యాపారులు విదేశాలకు కూడా నాపరాయి ని ఎగుమతి చేస్తున్నారు.
వ్యాపార, వాణిజ్య రంగం లో వికారాబాద్ జిల్లాలో తాండూరు దినదినాభివృద్ధి చెందుతున్నది. నాపరాతి గనులతోపాటు సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ ఏర్పాటయ్యాయి. తాండూ రు మండలంలో పెన్నా, ఐసీఎల్, సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీలున్నాయి. అదేవిధంగా తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో చిట్టెనాడు, కలబురిగి (వికాట్సాగర్) సిమెంట్ ఫ్యాక్టరీలున్నాయి. ఇక్కడికి నిత్యం వేల సం ఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సిమెంట్, బొగ్గు లోడు, ఆన్ లోడింగ్ పెద్దస్థాయిలో జరుగుతుంది.
ఇండస్ట్రియల్ పార్కుతో కాలుష్యానికి చెక్
ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటైతే తాండూరు ప్రాం తంలో కాలుష్యాన్ని అరికట్టొచ్చు. పాలిషింగ్ యూని ట్ల ద్వారా వెలువడే సుద్ధతో కాలుష్యం వస్తున్నది. తాండూరు చుట్టూ ఉన్న పాలిషింగ్ యూనిట్లను ఒక ప్రాంతానికి తరలిస్తే కాలుష్యాన్ని తగ్గించొచ్చు. మండలంలోని జినుగుర్తి గ్రామ శివారులో సర్వేనంబర్ 206లో 222 ఎకరాల అసైన్డ్ భూమిని అధికారులు గుర్తించి, జిల్లా కలెక్టర్, టీఎస్ఐఐసీ శాఖ అధికారులకు నివేదికలు పంపించారు.
నష్ట పరిహారం రూ.12 లక్షలు చెల్లించండి
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం భూములు ఇచ్చే వారికి పరిహారం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.12లక్షలు ఇవ్వాలని రైతులు అధికారులకు విన్నవించారు. మొత్తం 82 మంది రైతులుండ గా.. అందులో 16 మందికి బోరు బావులున్నా యి. బోరు బావులు ఉన్నందున తమకు పరిహా రం ఎక్కువగా చెల్లించాలని వారు కోరుతున్నారు. పరిహారం చెల్లింపునకు సంబంధించి అధికారులు ఇప్పటికే రైతుల వివరాలను సేకరించి కసరత్తు చేస్తున్నారు.