బొంరాస్పేట : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలకు మండలంలోని నాందార్పూర్ మల్లికార్జున ఒగ్గుకళా సేవా సమితి కళాకారులకు ఆహ్వానం వచ్చింది. ఒగ్గు బీరప్ప నాయకత్వంలో కళాకారులు ప్రకాష్, శివ, మల్లేశ్, భద్రయ్య, ప్రవీణ్, నరసింహ తదితర 15 మంది కళాకారులు గురువారం విజయవాడకు తరలి వెళ్లారు. వీరు సీఎం క్యాంపు కార్యాలయంలో పలు రకాల ఒగ్గు కళా ప్రదర్శనలు ప్రదర్శించారు.
వీటిని తిలకించిన సీఎం జగన్మోహన్రెడ్డి కళాకారులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఒగ్గు కళను ప్రదర్శించే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి బీరప్ప, కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు.