కొందుర్గు : తన కొడుకు మృతి చెందడంలో అనుమానం ఉందని భావించిన ఓ మహిళ కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొందుర్గు మండలంలోని లాలపేట గ్రామానికి చెందిన మక్తల నర్సింహులు(29) ఆగస్టు 8న మృతి చెందాడు. తన కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు ఆగస్టు 9న దహన సంస్కరణలు చేశారు. కాగ తమ కుమారుడు గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తితో గొడవ పడిన రెండు రోజులకే మృతి చెందినట్లు తెలుసుకుంది.
తన కుమారుడిని ఆనంద్ కొట్టడం వల్లనే మృతి చెందాడని భావించిన అంతమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతమ్మ ఫిర్యాదు మేరకు గ్రామంలో నర్సింహులును పూడ్చి పెట్టిన స్థలంలో శవాన్ని తవ్వి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల నుంచి వచ్చే నివేదిక ఆదరంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. సంఘటన స్థలంలో తాసీల్దారు శ్రీకాంత్రెడ్డి, ఏసీపీ కుశల్కర్, షాద్నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ, కొందుర్గు ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు.