వికారాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా అంతటా తనిఖీలు ముమ్మరమయ్యాయి. జిల్లాను ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం భారీగా తరలించే అవకాశాలు న్న దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం చెక్పోస్టుల వద్ద 24 గంటలపాటు బందోబస్తును ఏర్పాటు చేసింది.
చెక్పోస్టుల ఏర్పాటుతోపాటు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు, మండలాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద విస్తృతంగా వాహ నాల తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై నేరుగా ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సీ-విజిల్ యాప్, 1950 టోల్ఫ్రీ నంబర్ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా ఆరు ఫ్లయింగ్ స్కాడ్, 6 ఎస్ఎస్టీ బృందాలు 24 గంటలపాటు పర్యవేక్షిస్తున్నాయి.
జిల్లాలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఎన్నికల అధికారులు నియమించిన ఫ్లయింగ్ స్కాడ్ బృందాలతోపాటు పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లోని ప్రధాన కూడళ్లు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద అను మానం ఉన్న ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. ఈనెల 16న పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయగా, ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి రావడంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రత్యేకంగా చెక్పోస్టులను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి నగదును తరలిస్తే ఆ డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది.
లేకుంటే ఆ నగదును జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగి స్తారు. అదేవిధంగా రూ.10 లక్షలకు మించి నగదు పట్టుబడితే ఆ మొత్తాన్ని ఐటీ శాఖకు అప్పగిస్తారు. అయితే ఐదు రోజుల్లో జిల్లాలో నిర్వహించిన తనిఖీ ల్లో రూ.3.51లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంట్వారం పోలీస్స్టేషన్ పరిధిలో రూ.లక్ష, మోమిన్పేట పీస్ పరిధిలో రూ.2 లక్షలు, కులకచర్ల పీఎస్ పరిధిలో రూ.51,200.. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 128 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు 15 కేసులు నమోదు చేశారు. జిల్లాలో 240 లైసెన్స్డ్ గన్లు ఉండగా, ఇప్పటికే 218 మంది డిపాజిట్ చేశారు.
జిల్లా పరిధిలో ఏడు అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులతో వాటిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని అంతర్రాష్ట్ర చెక్పోస్టులను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన దౌల్తాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చంద్రకల్ వద్ద.. కొడంగల్ పీఎస్ పరిధిలో కస్తూరుపల్లి వద్ద.. బషీరాబాద్ పీస్ పరిధిలో మైల్వార్, ఇందర్చెడ్, నవాంగి వద్ద.. కరన్కోట్ పీఎస్ పరిధిలో కొత్లాపూర్ వద్ద, బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో బొపనారం వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
– కోటిరెడ్డి, వికారాబాద్ ఎస్పీ
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దృష్ట్యా జిల్లా అంతటా గట్టి నిఘా పెంచడంతోపాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా జిల్లాకు అనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వద్ద ఏడు అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలపాటు తనిఖీలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలోని ప్రధాన కూడళ్ల వద్ద కూడా నిత్యం తనిఖీలను ముమ్మరం చేశాం. కోడ్ అమల్లో ఉన్నందున రూ.50 వేలకు మించి ఎవరైనా నగదును తరలిస్తే దానికి సంబంధించిన ఆధారాలు, ధ్రువపత్రాలను చూపించాలి. లేకుంటే ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.