ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పీఎం జన్మన్ కార్యక్రమం సోమవారం పండుగలా సాగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో లైవ్ స్క్రీన్ వర్చువల్గా పీఎం మోదీతో కలిసి ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఒకేసారి ప్రారంభించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఏర్పాటు చేసిన వర్చువల్ మీటింగ్లో రంగారెడ్డి కలెక్టర్ శశాంకతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రధాని సందేశాన్ని చెంచుజాతి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధగా విన్నారు. ఆ తర్వాత చెంచు లబ్ధిదారులకు వివిధ పథకాలకు సంబంధించిన కార్డులను అధికారులు అందజేశారు. అనంతరం చెంచుల వైద్య సదుపాయం కోసం చేసిన నూతన అంబులెన్స్లను కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్ సుశీల్విమల్, గురుకులాల కార్యదర్శి నవీన్, రంగారెడ్డి కలెక్టర్, ఇతర అధికారులు ప్రారంభించారు.
-పెద్దేముల్/కడ్తాల్, జనవరి 16