శంకర్పల్లి, జూన్ 29 : పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తొలి ఏకాదశి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తున్నదని అన్నారు. సర్వ మతాలు, కులాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్కుమార్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ శ్వేత, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు, యూత్ విభాగం అధ్యక్షుడు వాసుదేవ్కన్నా, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండల వ్యాప్తంగా బక్రీద్ను ఘనంగా జరుపుకున్నారు. మజీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక పార్థనలు చేశారు. ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
షాబాద్ : కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. బక్రీద్ సందర్భంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంఏ మతీన్, ఇమ్రాన్ తదితరులను కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని వివిధ దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, నాయకులు ఆరీఫ్, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల వ్యాప్తంగా బక్రీద్ను ఘనంగా జరుపుకున్నారు. వెల్జాల్ గ్రామంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రహమాన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో దస్తగిర్, సజ్జుపాషా, సుల్తాన్, సలీం, కరీం, నిరంజన్, జలీల్, రావూఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రంజాన్ పర్వదిన వేడుకలను గురువారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే మసీదులు, ఈద్గాలు, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా బంధువులు, రాజకీయపార్టీల నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో బక్రీద్ను ఘనంగా నిర్వహించారు.
మొయినాబాద్ : ముస్తాఫా హిల్స్ మీద ముస్ల్లింలు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండుగను ఘనంగా నిర్వహించారు. మసీదుల వద్ద ఏర్పాట్లు చేశారు.
కొత్తూరు : కొత్తూరు మండలం, మున్సిపాలిటీలో బక్రీద్ను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, బ్యాగరి యాదయ్య, వెంకటేశ్, ఆంజనేయులుగౌడ్, శ్రీను చారి, రాఘవేందర్ యాదవ్, ప్రవీణ్, లతీఫ్, మైనార్టీలు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : బక్రీద్ పర్వదినాన్ని షాద్నగర్ పట్టణంలోని ముస్లింలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్నగర్ ఈద్గా వద్ద వందలాది మంది ముస్లింలు ప్రత్యేక పార్థనలు చేశారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఈద్గాకు చేరుకుని ఈదూల్ జూహ నమాజ్ను చేసి అల్లాను ప్రార్థించారు. ఈద్గా వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు శంకర్, శేఖర్, యాదగిరి, బాబర్ఖాన్, శ్రీకాంత్ పాల్గొన్నారు
కేశంపేట : మండల వ్యాప్తంగా బక్రీద్ను ఘనంగా జరుపుకున్నారు. ఊరేగింపుగా ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, సర్పంచ్, ఎంపీటీసీలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ముస్లిం ఫ్రంట్ మండలాధ్యక్షుడు మక్బూల్, నాయకులు లాయిఖ్, జబ్బార్ఖాన్, నసీరుద్దీన్, జావేద్ పాల్గొన్నారు.
కడ్తాల్ : మండల వ్యాప్తంగా బక్రీద్ను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ఇమామ్ జహీరుద్దీన్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మజీద్ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, ఏఎస్ఐ విష్ణువర్ధన్రెడ్డి, ముస్లింలు అబ్దుల్ రవూఫ్, మహ్మద్ జావిద్, జహంగీర్అలీ, అసిఫ్అలీ, హిమయత్అలీ, గౌస్, ఇర్షాద్, వాహబ్, యూసుఫ్ పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంలోని మసీదులో ముస్లింలు బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సీఐ ఎన్.సురేశ్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
చేవెళ్లటౌన్ : ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.