బషీరాబాద్, డిసెంబర్ 6: కుట్రల బీజేపీ పార్టీకి ప్రజల నుంచి కౌంటర్ తప్పదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని, ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చే ఆదరణను చూసి బీజేపీ పార్టీ పెద్దలు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ‘పల్లె పల్లెకు పైలెట్’ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు మంగళవారం బషీరాబాద్, గంగ్వార్, క్యాద్గీరా, జీవన్గి, అల్లాపూర్, జమ్లానాయక్తండా, దామర్చేడ్, వాల్యా నా యక్తండా, నంధ్యానాయక్తండా, కోత్లాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భం గా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజీపీపై నిప్పులు చెరిగారు. తాండూరు ప్రజలకోసం, నియోజక వర్గ అభివృద్ధి కోసం బీజేపీ కుట్ర లను తిప్పికొట్టానని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్న బీజేపీ పెద్దలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని, దాన్ని తిప్పి కొట్టే అదృష్టం తనకు దక్కడం చాలా గర్వంగా భావిస్తున్నానని, బీజేపీ చెంచాగాళ్లను చెంచల్ గూడా జైలుకు పంపామని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తెలిపారు.
మండలానికి రూ.100 కోట్ల నిధులు
బషీరాబాద్ నా సొంత మండలం కావడం అదృష్టం. మండలానికి కనీవిని ఎరగని రీతిలో రూ. 100 కోట్ల నిధులు తీసుకొచ్చానన్నారు. త్వరలోనే తాండూరు రూపురేఖలు మార బోతున్నాయన్నారు. మండల కేంద్రానికి త్వరలో జూనియర్ కాలేజీ వస్తుం దని, ఆ జీవో విడుదల అవుతుందన్నారు. రూ. మూడు కోట్లతో మండల కేంద్రాన్ని అభివృద్ధి పరుస్తామని, అందుకు సంబంధించిన నిధులను ఇవాళ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, వచ్చే ఆరు నెలల్లో మిగ తా సమస్యలన్నీ తీరుతాయన్నారు. ఇల్లులేనివారికి సొంత స్థలం ఉంటే రూ. 3 లక్షలు ఇవ్వనున్నట్లు త్వరలోనే జీవో రానుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు రామునాయక్, నాయకులు నర్సిరెడ్డి(రాజు) రంగారెడ్డి, మునీందర్రెడ్డి, నరేశ్ చౌహన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.