రంగారెడ్డి : 111 జీవోను ఎత్తి వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 69 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఇక తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, జంటనగరాల దాహార్తి తీర్చిన హిమాయత్సాగర్, గండిపేట జంట జలాశయాల పరిరక్షణ కోసం 1996లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన 111 జీవోను తెలంగాణ ప్రభుత్వం షరతులతో ఎత్తివేశారు. తాజాగా జీవో 69 విడుదల చేసి జలాశయాల పరిరక్షణతోపాటు చుట్టుపక్కల పచ్చదనం పెంపునకు (గ్రీన్సిటీ) పటిష్ట చర్యలు తీసుకోవాలని జీవోలో పొందుపరిచారు. దీంతో 84 గ్రామాల్లోని ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.