పెద్దేముల్ : వినాయకుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గాజీపూర్ గ్రామంలో భవాని యూత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణ నాథున్ని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ మాట్లాడుతూ గణపతి దేవుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖ:సంతోషాలతో ఆనందంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయపరంగా రైతులు సాగు చేసిన పంటలు అన్ని సంమృద్ధిగా పండి రైతులు సంతోషంగా ఉండాలని కోరానన్నారు.
అనంతరం గణనాథుడి పూజలో భాగంగా గ్రామానికి విచ్చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ను స్థానిక సర్పంచ్ తలారీ వీరప్ప ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరప్ప, ఉప సర్పంచ్ వెంకటయ్య, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముస్తఫా, భవానీ యూత్ సభ్యులు సంగమేశ్వర్, నాగభూషణం, బాలప్ప, బాల్రాజ్, రాఘవేందర్, జగదీష్గౌడ్, సాయి కుమార్, సతీశ్, శ్రీను, ఆనంద్ పాల్గొన్నారు.