ఇబ్రహీంపట్నం, జూన్ 30 : సంచలనం సృష్టించిన రియల్ఎస్టేట్ వ్యాపారుల జంటహత్యల కేసులో మరో ఇద్దరు నిందితులపై గురువారం రాచకొండ సీపీ మహేష్భగవత్ పీడీయాక్టు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో గతంలో రియల్ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డిలను హత్యచేసిన కేసులో ఇప్పటికే ముగ్గురుపై పీడీయాక్టు నమోదు చేశారు.
గురువారం ఇదే కేసులో ఏ-4గా ఉన్న రహీంతో పాటు ఏ-5గా ఉన్న మహ్మద్ మసూమ్పై కూడా పీడీయాక్టు నమోదు చేశారు. హత్యకేసులో నిందితులైన మట్టారెడ్డి, మోహిన్, భిక్షపతిలపై ఇప్పటికే పీడీయాక్టు నమోదు చేశారు. గురువారం మరో ఇద్దరిపై పీడీయాక్టు నమోదు చేయటంతో ఈ కేసులో ఇప్పటికే ఐదుమందిపై పీడీయాక్టు నమోదు చేసినైట్లెంది.
పీడీయాక్టు నమోదు చేసిన నిందితులు బీహార్ నుంచి ఆయుధాలు సరఫరా చేయటంతో పాటు నిందితులకు సహకరించినట్లు పోలీసులు నిర్దారించారు. రియల్ఎస్టేట్ వ్యాపారుల జంటహత్యల కేసును సీరియస్గా తీసుకున్న రాచకొండ సీపీ మహేష్భగవత్ నిందితులు శిక్షనుంచి తప్పించుకోకుండా దర్యాప్తును పకడ్బందీగా కొనసాగిస్తున్నారు.