రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. సచివాలయ భవనంలోని మొదటి అంతస్తులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కుటుంబసభ్యులు వికారాబాద్ జడ్పీచైర్పర్సన్ పట్నం సునీతారెడ్డితోపాటు ఆయన కుమారుడు, కూతురు, ఎంపీ రంజిత్రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్ తదితరులతో పాటు ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, ఇతర పార్టీ నేతలు భారీగా తరలివెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
– ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30 : రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి అంతస్తులో వేదపండితులు, కుటుంబసభ్యుల మధ్య ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హాజరైన వారిలో కుటుంబసభ్యులు వికారాబాద్ జడ్పీచైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, కుమారుడు రినీశ్రెడ్డి, కూతురు మనీష, సోదరుడు, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి, మెతుకు ఆనంద్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, బాల్క సుమన్, ప్రకాశ్గౌడ్, అంజయ్యయాదవ్, గ్రంథాలయ సంస్థ రంగారెడ్డి జిల్లా చైర్మన్ వెంకటరమణారెడ్డి, శంషాబాద్ జడ్పీటీసీ తన్వీరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, జెర్కోని రాజుతో తదితరులు మహేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
కొడంగల్/వికారాబాద్ :రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం పదవీబాధ్యతలు చేపట్టడంతో ఆయనకు మంత్రులు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి శుభాకాంక్షలు వెలు వెత్తాయి. సచివాలయంలోని భవనం లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్ రెండోవార్డు కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, బొంరాస్పేట పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజు లారమేశ్కుమార్, యాదగిరి, బాబర్ తదితరులు పాల్గొన్నారు.