పరిగి : దళితులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడమే దళితబంధు పథకం లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని బృందావన్గార్డెన్లో జరిగిన నియోజకవర్గస్థాయి అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం ద్వారా దళితుల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా సర్కారు కృషి చేస్తుందన్నారు. ఈ మార్చి 7వ తేదీ లోపు నియోజకవర్గంలోని 100 మంది లబ్ధిదారులకు దళితబంధు కింద యూనిట్లు గ్రౌండ్ చేసే విధంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు.
మార్చి తర్వాత నియోజకవర్గంలో మరో 2వేల మంది లబ్ధిదారులకు దళితబంధు ద్వారా లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఈ పథకం ద్వారా జీవన విధానమే మారిపోతుందని తెలిపారు. ఏర్పాటు చేసే యూనిట్ ఎంపిక అత్యంత ప్రధానమైందని, తమ గ్రామంలో లేని యెడల ఇతర చోట్ల ఎక్కడ యూనిట్లు నెలకొల్పినా వ్యాపారం చక్కగా కొనసాగే వాటిని ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ విషయంలో అధికారులు తగిన సూచనలు, సలహాలు అందిస్తారని, యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులది తుది నిర్ణయమని ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పలు పథకాలు శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నపుడు సిద్దిపేటలో అమలు చేసిన దళితజ్యోతి పథకం కొనసాగింపే దళితబంధు పథకమని అన్నారు.
లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూరే వరకు ఈ పథకం కొనసాగుతుందన్నారు. జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి తొందర లేకుండా, అన్ని రకాలుగా ఆలోచించి యూనిట్లు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా తమ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడేలా ఉండాలన్నారు. లబ్దిదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేసేందుకు అధికారులు ఎల్లపుడు సిద్ధంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల ఈడీలు బాబు మోజెస్, యాదయ్య, ఎంపీపీలు అరవిందరావు, సత్యమ్మ, అనుసూజ, జడ్పీటీసీలు హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, పరిగి, కులకచర్ల మార్కెట్ చైర్మన్లు సురేందర్, హరిక్రిష్ణ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాల అధ్యక్షుడు మేడిద రాజేందర్, పీరంపల్లి రాజు, దోమ వైస్ ఎంపీపీ మల్లేశం, ఎంపీడీవో శేషగిరిశర్మ, లబ్ధిదారులు పాల్గొన్నారు.