పరిగి : కరోనా కట్టడిలో భాగంగా చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వే ఏడో రోజు కొనసాగింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 587 ప్రత్యేక బృందాలు గురువారం 21059 కుటుంబాల ఇంటింటి జ్వర సర్వే చేపట్టారు. జిల్లాలో 22,0386 కుటుంబాలు ఉండగా ఇప్పటివరకు 204106 కుటుంబాల సర్వే పూర్తయింది. జిల్లాలోని బంట్వారం, చన్గోముల్, చిట్యాల్, ధారూర్, దోమ, దౌల్తాబాద్, కోట్పల్లి, మోమిన్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటి జ్వర సర్వే పూర్తయింది. ఈ సందర్భంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు లక్షణాలు ఉన్నటువంటి వారికి వైద్యుల సూచనల మేరకు మందులు అందజేశారు.
అలాగే అర్హులందరు కొవిడ్ టీకాలు వేయించుకోవాలని బృందం సభ్యులు సూచించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా పరిధిలో 15నుంచి 17ఏళ్ల లోపు వారు 586మందికి, 18 ఏళ్లు పైబడిన వారిలో మొదటి డోసు 1111 మందికి, రెండవ డోసు 3267 మందికి, 60 ఏళ్లు పైబడిన వారిలో 204 మందికి ప్రికాషనరీ డోసు కోవిడ్ టీకా వేయడం జరిగింది.