పరిగి, జనవరి 4 : అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం పరిగి మండలం సయ్యద్మల్కాపూర్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మండల ప్రత్యేకాధికారి బాబు మోజెస్, సర్పంచ్ సయ్యద్ ఫాహీసుల్తానా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
దోమ : మండలంలోని బ్రాహ్మణపల్లి, పెద్దతండా, గోన్యానాయక్తండా, మోత్కూర్ గ్రామాల్లో గురువారం ప్రజాపాలన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మోత్కూర్, గోన్యానాయక్తండాలో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కార్యక్రమాలను ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ మల్లేశం, ఎంపీడీవో జయరాం, స ర్పంచ్ కేశవులు, ఉప సర్పంచ్ శ్రీకాంత్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి, కేఎస్ఆర్ ట్రస్టు అధ్యక్షుడు శరత్కుమార్రెడ్డి, శాంతాకుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
పెద్దేముల్ : దళారుల వ్యవస్థకు తావు లేకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు ఇందూరు, తట్టేపల్లి, అడికిచెర్ల గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు చేపట్టే అభివృద్ధి పనులను వివరించారు.
అనంతరం అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యేను అ ధికారులు, నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ధారాసింగ్, వైస్ ఎంపీపీ మధులత, ఎమ్మార్వో కిషన్, ఎంపీడీవో లక్ష్మప్ప, ఆర్ఐ రాజూరెడ్డి, సర్పంచులు విజయమ్మ, పద్మ, ఎంపీటీసీ అంబరయ్య, ఉపసర్పంచ్ శీను, నాయకులు ఎల్లారెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రవీణ్కుమార్ గుప్తా, గోపాలకృష్ణ, జితేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఆనందం, నర్సింహులు, శోభమ్మ, మండల కోఆప్షన్ స భ్యుడు నజీర్, విద్యాసాగర్, నరేందర్, మొగులప్ప, సూపర్వైజర్ రాణి, రవిశంకర్, బుజ్జమ్మ, కిరణ్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్, రాజు పాల్గొన్నారు.
వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 21, 24, 25, 26, 27వ వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేషన్ కార్డు లేని వారు నూ తన రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి ఇ వ్వాలని సూచించారు. కార్యక్రమం లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్లు సురేశ్, కృష్ణారెడ్డి, కమిషనర్ జాకీర్ అహ్మద్, టీపీవో శ్రీధర్, ఏఈ రాయుడు, నాయకులు ప్రభాకర్, రాజు, ఫరూ క్, హనుమంతు, సురేశ్, సుధాకర్, దీపు, సందీప్, రహీం, సుదీప్, బుచ్చిరెడ్డి, సత్యనారాయణ, నాగరాజు, రాకేశ్, నర్సింహులు, శ్యామ్, సంతోశ్, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీ లు, ఆయా వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ : పేదలను ఆదుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకాలను అమలు చేస్తున్నదని ఎంపీపీ ము ద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులతో పాటు మండలంలోని చిట్లపల్లి, ఇందనూర్ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్ర జాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరూ ఈ పథకాలను దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. చిట్లపలిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారి డీఆర్డీవో కృష్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు వెంకట్రెడ్డి, బాల్రెడ్డితో పాటు ఎంపీడీవో పాండు, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీవో శ్రీనివాస్, మిషన్ భగరథ ఏఈ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్పేట : ఆరు గ్యారెంటీల కోసం అర్హులైన ప్రతి ఒ క్కరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రజాపాలన మండల ప్రత్యేకాధికారి రాంరెడ్డి కోరారు. గురువారం మండలం లోని బొంరాస్పేట మండలంలోని బొంరాస్పేట, చౌద ర్పల్లి, రేగడిమైలారం, దుద్యాల మండల కేంద్రాల్లో ని ర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామసభల్లో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకన్గౌడ్, తహసీల్దార్లు వెంకటేశ్, దానయ్య, డీటీ రవి కుమార్, ఆర్ఐ రవిచారి, అధికారులు పాల్గొన్నారు.
ధారూరు : గ్రామాల్లోని ప్రజలు అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా 6 గ్యారెంటీ పథకాలను అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి మల్లే శం తెలిపారు. గురువారం మండలంలోని తరిగోపుల, మున్నూరు సోమారం, నాగుసాన్పల్లి, ఎబ్బనూరు గ్రా మాల్లో ప్రజాపాలనలో భాగంగా గ్రామసభల్లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఎం పీడీవో చెన్నారెడ్డి, తహసీల్దార్ భువనేశ్వర్, ఎంపీవో షఫీఉల్లా, ఏపీవో సురేశ్కుమార్, మండల వ్యవసాయ అధికారి ఝా న్సీలక్ష్మి, ఏఈవో సంజీవ్ రాథోడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.