కులకచర్ల, జనవరి 5 : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం చౌడాపూర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డితో కలిసి పాల్గొని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రజల సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రజల అవసరాల మేరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. సంక్షేమ పథకాలను అర్హత గల కుటుంబాలు ఉపయోగించుకునేలా చూడాలన్నారు. ఇతర రాష్ర్టాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారని.. అంటే రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నారని తెలిపారు. పార్టీని దేశంలోని అన్ని రాష్ర్టాల్లోకి తీసుకెళ్లి పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనీల్రెడ్డి, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, యువజన విభాగం నాయకులు వెంకట్, మేగ్యానాయక్,సర్పంచులు, ఎంపీటీసీ, ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులున్నారు.
క్రీడల్లో స్నేహభావం పెంపొందుతుందని డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సర్పంచ్ శిరీషతో కలిసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి దోహదపడుతాయని తెలిపారు. క్రీడాకారులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బండవెల్కిచర్ల ఉపసర్పంచ్ రాములు, నాయకులు శ్రీనివాస్, సత్యంరెడ్డి, వెంకటయ్య, ఎంపీటీసీ రాంలాల్, క్రీడల నిర్వాహకులు పాల్గొన్నారు.
పరిగి : టోర్నమెంట్ల నిర్వహణతో క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభాపాఠవాలు వెలుగులోకి వస్తాయని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పరిగి మండలం మాదారం గ్రామంలో నిర్వహించిన వీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, సర్పంచ్లు రాములు, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.