వికారాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రతి ఎకరానికీ సాగు నీరందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు నీరందిస్తున్న సర్కారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తాగు, సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు వేగవంతమయ్యాయి. అయితే ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు తాగు,సాగు నీరందనున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఉద్దండపూర్ రిజర్వాయ ర్ ద్వారా జిల్లాకు తాగు, సాగు నీటిని కాలువల ద్వారా అం దించేందుకు రూ.5,180 కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేయగా.. ఆ మొత్తాన్ని నూతన సచివాల య ప్రారంభోత్సవం సందర్భంగా మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిసిందే. 2015 పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సీఎం కేసీఆర్ శం కుస్థాపన చేయగా.. ఏపీతోపాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు కేసులు వేయడంతో పనులు నిలిచిపోయాయి. ఇటీవల తాగునీటికి సంబంధించిన పనులను చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతులివ్వడంతో పనులు జోరందుకున్నా యి. ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాలోని పరిగి, తాం డూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు. ప్రస్తుతం కాలువల నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సాగుతున్నది. పనుల పూర్తికి అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.
జిల్లాకు తాగు-సాగు నీరు..
ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు తాగునీటిని అందించేందుకు వంద కిలోమీటర్ల మేర కాలువలను తవ్వనున్నారు. అదేవిధంగా కాలువల ద్వారా కృష్ణా జలాలతో జిల్లాలోని దాదాపు 1000 చెరువులను నీటితో నింపేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. అయితే జూలైలోగా శ్రీశైలం బ్యాక్ వాటర్ను ఉద్దండపూర్ రిజర్వాయర్కు తరలించనున్నారు. సాగునీటిని అందించేందుకు అనుమతులొచ్చిన వెం టనే వంద కిలోమీటర్ల మేర ఎడమ కాలువలను నిర్మించనున్నారు. అక్కడ సుమారు నాలుగు లక్షల ఎకరాల వరకు ఆయకట్టున్నది. పరిగి నియోజకవర్గంలో 80,000 ఎకరాలకు, తాండూరు ని యోజకవర్గంలోని 1,02,797, వికారాబాద్ నియోజకవర్గంలోని 89,287, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మం డలంలోని 900, కొడంగల్ నియోజకవర్గంలోని 90,000 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అయితే ఉద్దండపూర్ నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలకు తాగు,సాగు నీరు..కరివెన నుంచి కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కోస్గి తదితర మండలాలకు తాగు,సాగు నీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కోట్పల్లి ప్రాజెక్టుతో 9,200 ఎకరాలకు..
జిల్లాలో సాగు నీరందించే ప్రధాన ప్రాజెక్టు అయిన కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 9,200 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. అదేవిధంగా ప్రధానంగా తాండూరు నియోజకవర్గంతోపాటు వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు మండలంలోని పలు గ్రామాలకు సాగు నీరందించనున్నారు. కోట్పల్లి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 8,100 ఎకరాలు, ఎడమ, బేబి కాలువల ద్వారా 1,100 ఎకరాలకు సాగు నీరందించే కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తైతే 15 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం పెరుగుతుందని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా 50 ఏండ్ల క్రితం నిర్మించిన కోట్పల్లి ప్రాజెక్టును గత పాలకులు విస్మరించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధునీకరణకు చర్యలు చేపట్టారు. రూ. 38.54 కోట్లతో కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణతోపాటు ఆనకట్ట బలోపేతం, కాలువల పునర్నిర్మాణం, మరమ్మతులు చేపట్టనున్నారు. అయితే ఆనకట్టను బలోపేతం చేయడం, కుడి, ఎడమ, బేబి కాలువల పునర్నిర్మాణం, మరమ్మతులు, కాలువల ఆధునీకరణ, కాలువల వెంబడి ముళ్ల పొదలను, మట్టిని తొలగించడం వంటి పనులు చేపట్టనున్నారు.