ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నేతలు
ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 7 : ప్రతిపక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని, ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడులో టీడీపీ సీనియర్ నాయకుడు బుట్టి మహేశ్తో పాటు సుమారు 20 మంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలతో వైస్ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిషన్రెడ్డి సమక్షంలో గురువారం క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలెప్పుడొచ్చినా టీఆర్ఎస్ పార్టీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షపార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నదని తెలిపారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా బలోపేతం కావడానికి కార్యకర్తలు, నాయకులను ఏకం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు రానున్న రోజుల్లో పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. బుట్టి రాజు, ప్రభాకర్, గణేశ్, మహేందర్, శ్రీరాములు, రవిగౌడ్, మహేందర్, ధనుంజయ్య, రాజు, రాములు, నవీన్, సురేశ్, అంజయ్య, శివప్రసాద్, రాజు తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, నాయకులు నర్సింహ, కిషన్రెడ్డి, చంద్రయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీ పరిధి 22వ వార్డులో ఎంకేఆర్ నగర్ కాలనీలోని సమస్యల పరిష్కారానికి ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హామీ ఇచ్చారని కౌన్సిలర్ చెవుల హరిశంకర్ అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో హరిశంకర్ ఆధ్వర్యంలో కాలనీవాసులు కిషన్రెడ్డిని కలిశారు. సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని కౌన్సిలర్ హరిశంకర్ తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించినందుకు హర్షం వ్యక్తంచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంకేఆర్నగర్ కాలనీ ప్రతినిధులు మహేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జోర్క రాము, మాడుగుల వెంకటేశ్గౌడ్, బయ్య వెంకటేశ్, ఎత్తరి గిరి, కంబాలపల్లి రవి, సురేందర్రెడ్డి, ముస్తాక్, దోటి శ్రీను, కపిల్ పాల్గొన్నారు.